National13th Sep 04:01 PMSunil Byrisetty1 min read
మణిపూర్లో ప్రధాని మోదీ పర్యటన
మణిపూర్లో అల్లర్ల తర్వాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన అల్లర్ల బాధితులను పరామర్శించి, బాధిత కుటుంబాల చిన్నారులతో ముచ్చటించారు. ఇంఫాల్, చురాచంద్పూర్
మణిపూర్లో అల్లర్ల తర్వాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన అల్లర్ల బాధితులను పరామర్శించి, బాధిత కుటుంబాల చిన్నారులతో ముచ్చటించారు.
ఇంఫాల్, చురాచంద్పూర్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి, కొన్ని ప్రాజెక్టులను ప్రారంభించారు. భారీ వర్షాల కారణంగా హెలికాప్టర్లో ప్రయాణం సాధ్యపడకపోవడంతో రోడ్డుమార్గంలో మణిపూర్ చేరుకున్న మోదీకి ప్రజలు ఘన స్వాగతం పలికారు. “రోడ్డుమార్గంలో వస్తుండగా మీరు పలికిన స్వాగతం నేను ఎప్పటికీ మర్చిపోలేను” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.