National17th Jul 02:55 PMSunil Byrisetty1 min read
సోనమ్ వాంగ్చుక్ దీక్షపై మోదీ మౌనం వీడాలి
నీట్ పరీక్షలలో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన రామన్ మెగసెసే అ
నీట్ పరీక్షలలో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన రామన్ మెగసెసే అవార్డు గ్రహీత సోనమ్ వాంగ్చుక్కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య సంఘీభావం ప్రకటించారు. గత 20 రోజులుగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ అత్యంత కీలకమైన అంశంపై కనీసం స్పందించకపోవడం అత్యంత దారుణమన్నారు. తక్షణమే అక్కడి దీక్షా శిబిరాన్ని సందర్శించి, ఆయనతో చర్చలు జరిపి దీక్షను విరమింపజేయించాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలకు బాధ్యులైన వారందరినీ కఠినంగా శిక్షించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ సోనమ్ వాంగ్చుక్ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారని ఈశ్వరయ్య తెలిపారు. అయినప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వం కనీసం స్పందించకుండా నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోందని ఆయన విమర్శించారు.