International10th Sep 09:27 AMSunil Byrisetty1 min read
ట్రంప్ పోస్టుపై మోదీ స్పందన!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పోస్టుకు ప్రధాని మోదీ స్పందించారు. భారత్-అమెరికా సన్నిహిత మిత్ర దేశాలు అంటూ వ్యాఖ్యానించారు. ఇరు దేశాలు సహజ భాగస్వాములన్నారు. వాణిజ్య చర్చలు ఇరుదేశాల భాగస
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పోస్టుకు ప్రధాని మోదీ స్పందించారు. భారత్-అమెరికా సన్నిహిత మిత్ర దేశాలు అంటూ వ్యాఖ్యానించారు. ఇరు దేశాలు సహజ భాగస్వాములన్నారు. వాణిజ్య చర్చలు ఇరుదేశాల భాగస్వామ్యం విస్తృతం చేసేందుకు దోహదం చేస్తాయన్నారు. ఇరుదేశాల అపరిమిత సామర్థ్యం విస్తృతానికి మార్గం సుగమం చేస్తామని విశ్వసిస్తున్నానని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా చర్చలు ముగించడానికి మా బృందాలు కృషి చేస్తున్నాయని మోదీ స్పష్టం చేశారు. ట్రంప్ తో మాట్లాడేందుకు నేను కూడా ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. ఇరుదేశాల ప్రజల భవిష్యత్తు, భద్రత కోసం కలిసి పనిచేస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.