News5th Oct 12:42 PMSunil Byrisetty1 min read
16న శ్రీశైలానికి మోదీ రాక!
ఏపీలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ నెల 16న శ్రీశైల మల్లన్న క్షేత్రాన్ని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి అధికారులు కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. వా
ఏపీలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ నెల 16న శ్రీశైల మల్లన్న క్షేత్రాన్ని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి అధికారులు కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం.
వాటికి రూ.1,600 కోట్ల మేర ఆర్థిక సాయం చేయాలని సీఎం, డెప్యూటీ సీఎం సమక్షంలో ప్రధానికి విన్నవించే ఆస్కారం ఉంది.
ప్రతిపాదనల్లో శ్రీశైల క్షేత్ర కారిడార్, కొత్త క్యూ కాంప్లెక్స్, మండపాల నిర్మాణం తదితరాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఏపీ అభివృద్ధికి ప్రధాని మోదీ పలు వరాలు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.