News26th Jan 04:59 PMSunil Byrisetty1 min read
శరవేగంగా పోలవరం ఎడమ కాలువ పనులు
ప్రభుత్వ ప్రత్యేక చొరవతో పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కొన్ని నెలలుగా మందకొడిగా సాగిన నిర్మాణ పనులు, ప్రస్తుతం వేగం పుంజుకున్నాయి. వచ్చే ఏడాది జూన్ నా
ప్రభుత్వ ప్రత్యేక చొరవతో పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కొన్ని నెలలుగా మందకొడిగా సాగిన నిర్మాణ పనులు, ప్రస్తుతం వేగం పుంజుకున్నాయి. వచ్చే ఏడాది జూన్ నాటికి పనులు పూర్తయ్యేలా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం పాయకరావుపేట నుంచి తాళ్లపాలెం వరకు ఎడమ కాలువ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ మార్గంలో రెండు చోట్ల నదులను దాటేందుకు అక్వడెక్ట్లను నిర్మిస్తున్నారు. పోలవరం ఎడమ కాలువ పూర్తయితే సుమారు 1.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటి సౌకర్యం అందనుంది.
అదేవిధంగా ఈ కాలువ ద్వారా 560 గ్రామాలకు త్రాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.