Crime8th Sep 01:38 PMSunil Byrisetty1 min read
కస్టడీలోకి సాదిక్ ఖాన్.. కీలక దర్యాప్తు
పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. సాదిక్ ను 3 రోజులు కస్టడీకి ఇస్తూ మొబైల్ కోర్టు అనుమతినిచ్చింది. స
పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. సాదిక్ ను 3 రోజులు కస్టడీకి ఇస్తూ మొబైల్ కోర్టు అనుమతినిచ్చింది. సాదిక్ను రాజమండ్రి జైలు నుంచి పోలీసులు సర్పవరం తీసుకువచ్చారు. ఈనెల 11న ఉదయం 10.30 వరకు పోలీసులు విచారించనున్నారు. జగదీశ్ రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న షేక్ సాదిక్ ఖాన్ ఏకంగా సైనైడ్ తో చంపేశాడు. ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులోనూ సాదిక్ ఖాన్ నిందితుడిగా ఉన్నాడు. కస్టడీ దర్యాప్తులో పోలీసులు కీలక ఆధారాలు, అంశాలు వెలుగులోకి తీసుకురానున్నారు.