News24th Dec 02:34 PMSunil Byrisetty1 min read
పోలవరం ప్రాజెక్ట్ లో పీపీఏ బృందం పర్యటన
పోలవరం ప్రాజెక్ట్ లో పీపీఏ బృందం పర్యటన చేపట్టింది. ప్రాజెక్ట్ నిర్మాణాన్ని సీఈఓ , ఇతర అధికారులు పరిశీలిస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సిఈఓ యోగేష్ పైతాన్కర్ నేతృత్వంలోని బృం
పోలవరం ప్రాజెక్ట్ లో పీపీఏ బృందం పర్యటన చేపట్టింది. ప్రాజెక్ట్ నిర్మాణాన్ని సీఈఓ , ఇతర అధికారులు పరిశీలిస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సిఈఓ యోగేష్ పైతాన్కర్ నేతృత్వంలోని బృందం ప్రాజెక్ట్ లో నిర్మాణం జరుగుతున్న డయాఫ్రమ్ వాల్, గ్యాప్ 1, 2 ప్రాంతాలలో పర్యటిస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ కు చేరుకున్న బృందానికి జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ కె నరసింహమూర్తి, ప్రాజెక్ట్ నిర్మాణ సంస్థ ఎం ఈ ఐ ఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సతీష్ బాబు స్వాగతం పలికారు. అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో సమావేశమైన బృందం సభ్యులు ఆ తరువాత పనుల పరిశీలన చేస్తున్నారు. పీపీఏ సిఈఓతో పాటు పోలవరంలో అథారిటీ సభ్య కార్యదర్శి ఎం రఘురాం, చీఫ్ ఇంజనీర్లు (పవర్) సి వి సుబ్బయ్య, ఎం రమేష్ కుమార్ (పీ అండ్ డి), డైరెక్టర్ కె శంకర్ పర్యటిస్తున్నారు.