Politics3rd Aug 05:56 PMSunil Byrisetty1 min read
ఉప ఎన్నికలో గెలిచిన పీకే!
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గెలిచారు. బిహార్లోని బాంకీపూర్ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం సాధించారు. జన్సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ గత ఎన్నికల్లో పోటీ చ
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గెలిచారు. బిహార్లోని బాంకీపూర్ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం సాధించారు. జన్సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ గత ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయన పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులంతా ఓడిపోయారు. దీంతో ఆయన పార్టీని మూసేయడం ఖాయమని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఏకంగా బీజేపీ అభ్యర్థినే ఓడించారు. 1995 నుంచి బాంకీపూర్లో ఓటమి ఎరుగని బీజేపీని తన ఆరంగేట్రంతోనే ఓడించిన ప్రశాంత్ కిషోర్ మరోసారి గేమ్ చేంజర్ గా మారారు.