National15th Aug 05:12 PMSunil Byrisetty1 min read
వర్షంలోనే అమరులకు నివాళులు
ఢిల్లీలో వర్షాలు జోరుగా పడుతున్నాయి. అయితే వాటిని లెక్క చేయకుండా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ దేశభక్తిని కనబర్చారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢ
ఢిల్లీలో వర్షాలు జోరుగా పడుతున్నాయి. అయితే వాటిని లెక్క చేయకుండా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ దేశభక్తిని కనబర్చారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమరులకు త్రివిధ దళాధిపతులతో కలిసి నివాళులర్పించారు. ఓ వైపు జోరు వాన కురుస్తున్నా లెక్క చేయలేదు. కార్యక్రమాన్ని కొనసాగించారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇదే అసలైన దేశభక్తి అంటే అని కామెంట్స్ వస్తున్నాయి.