News9th Jan 03:12 PMSunil Byrisetty1 min read

గుజరాత్‌లో 3 రోజులపాటు ప్రధాని మోదీ పర్యటన

ప్రధాని మోదీ గుజరాత్‌లో 3 రోజులపాటు పర్యటించనున్నారు. రేపు సోమనాథ్‌ ఆలయంలో ఓంకార మంత్ర జపంలో పాల్గొంటారు. ఎల్లుండి సోమనాథ్‌ స్వాభిమాన్‌ పర్వ్‌లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఎల్లు

గుజరాత్‌లో 3 రోజులపాటు ప్రధాని మోదీ పర్యటన
ప్రధాని మోదీ గుజరాత్‌లో 3 రోజులపాటు పర్యటించనున్నారు. రేపు సోమనాథ్‌ ఆలయంలో ఓంకార మంత్ర జపంలో పాల్గొంటారు. ఎల్లుండి సోమనాథ్‌ స్వాభిమాన్‌ పర్వ్‌లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఎల్లుండి వైబ్రంట్‌ గుజరాత్‌ సదస్సును ప్రారంభిస్తారు. అనంతరం అహ్మదాబాద్‌ మెట్రో రెండో దశ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. జనవరి 12న అహ్మదాబాద్‌లో జర్మన్‌ ఛాన్సలర్‌ మెర్జ్‌తో భేటీకానున్న ప్రధాని.. ఆయనతో కలిసి సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించనున్నారు. అహ్మదాబాద్‌లో గాలిపటాల ఉత్సవానికి మోదీ, మెర్జ్‌ హాజరవుతారు.
Prime Minister Narendra Modi
Gujarat Tour
Somnath Temple
Omkar Mantra Chanting
Somnath Swabhiman Parv
Vibrant Gujarat Summit
జర్మన్ ఛాన్సలర్ మెర్జ్
సబర్మతి ఆశ్రమం
గాలిపటాల ఉత్సవం
అహ్మదాబాద్
Scroll for the next article