Politics19th Dec 04:33 PMSunil Byrisetty1 min read
మోదీ ఇచ్చిన టీ పార్టీలో ప్రియాంక గాంధీ
ఢిల్లీలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన అనంతరం, సంప్రదాయం ప్రకారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభ్యులకు టీ పార్టీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకుర
ఢిల్లీలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన అనంతరం, సంప్రదాయం ప్రకారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభ్యులకు టీ పార్టీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలేతో పాటు అధికార, ప్రతిపక్షాలకు చెందిన పలువురు నేతలు హాజరయ్యారు. మరోవైపు, ప్రియాంక గాంధీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయి, తన నియోజకవర్గమైన వయనాడ్లోని రహదారుల సమస్యలపై చర్చించారు. ఇప్పుడీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.