Sports19th Jul 02:30 PMSunil Byrisetty1 min read
చరిత్ర సృష్టించిన పీవీ సింధు
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు అంతర్జాతీయ వేదికపై చరిత్ర సృష్టించింది. జపాన్ ఓపెన్ సూపర్-750 బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగా నిలిచింది. ఫైనల్లో జపాన్కు చెందిన అకానే యమగుచిని 21-17, 21-
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు అంతర్జాతీయ వేదికపై
చరిత్ర సృష్టించింది. జపాన్ ఓపెన్ సూపర్-750 బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగా నిలిచింది. ఫైనల్లో జపాన్కు చెందిన అకానే యమగుచిని 21-17, 21-17 తేడాతో ఓడించింది. ఈ సందర్భంగా దేశం గర్వించేలా జపాన్ ఓపెన్ లో పీవీ సింధు సంచలన విజయం సాధించిందని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ప్రశంసించారు. ఉత్కంఠ పోరులో విజయంతో సింధు సరికొత్త మైలురాయి లిఖించారని కొనియాడారు.
భారత బ్యాడ్మింటన్ చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం లిఖించబడిందన్నారు. రాబోయే ఒలంపిక్స్ బరిలో కూడా ఇదే జోరు కొనసాగించాలని ఆకాంక్షించారు. సింధు విజయాన్ని మాజీ సీఎం జగన్ అభినందించారు.