News21st Jun 05:24 PMSunil Byrisetty1 min read
సింహాద్రినాథుడి సేవలో పీవీ సింధు
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు విశాఖపట్నంలో పర్యటించారు. సింహాచలం దేవస్థానంలో వరాహలక్ష్మీ నృసింహ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆమెకు స్వాగత
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు విశాఖపట్నంలో పర్యటించారు. సింహాచలం దేవస్థానంలో వరాహలక్ష్మీ నృసింహ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. పీవీ సింధు ముందుగా కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం పండితులు ఆమెకు ఆశీర్వచనం చేయగా అధికారులు ప్రసాదాలు అందజేశారు.