Politics30th Jun 11:19 AMSunil Byrisetty1 min read

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాధవ్

తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులపై అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. పదవీ కాలం ముగియడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నూతన అధ్యక్షుల నియామక ప్రక్రియ ప్రారంభించింది. ఈ నేపథ్య

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాధవ్
తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులపై అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. పదవీ కాలం ముగియడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నూతన అధ్యక్షుల నియామక ప్రక్రియ ప్రారంభించింది. ఈ నేపథ్యలో ఆంధ్రప్రదేశ్ భాజపా అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ పేరు ఖరారు చేసినట్లు సమాచారం. అధ్యక్ష పదవికి నామినేషన్‌ వేయాలని పార్టీ అధిష్ఠానం ఆయన్ను ఆదేశించింది. పార్టీలో ఎక్కువకాలం ఉన్నవారికే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయం. అందులో భాగంగానే ఏపీలో మాధవ్‌, తెలంగాణలో రామచందర్‌రావులను ఎంపిక చేసింది.
Andhra Pradesh news
Ap politics
BJP
pvn madhav
BJP President Election
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాధవ్
Scroll for the next article