Politics7th Jun 05:40 PMSunil Byrisetty1 min read
మహారాష్ట్రలో రిగ్గింగ్.. బిహార్లోనూ అదే
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది జరిగే బిహార్ ఎన్నికల్లోనూ అదే రిపీట్ అవుతుందని ఆరోపించారు. ఎన్ని
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది జరిగే బిహార్ ఎన్నికల్లోనూ అదే రిపీట్ అవుతుందని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ ప్యానల్ ఎంపికలో అవకతవకలు, ఫేక్ ఓటర్లను నమోదు చేయడం, ఓటింగ్ శాతం పెరిగినట్లు చూపించడం, బీజేపీకి అవసరమైన చోట బోగస్ ఓట్లు వేయించడం ద్వారా కుట్రకు తెర లేపారని పేర్కొన్నారు. 'మ్యాచ్ ఫిక్సింగ్'తో గెలవొచ్చు కానీ వ్యవస్థలు నాశనమవుతాయన్నారు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఓడిపోయినప్పుడల్లా ఇలా మాట్లాడటం కాంగ్రెస్ నేతలకు అలవాటేనంటూ కౌంటర్ ఇస్తున్నారు.