News20th Jun 04:44 PMSunil Byrisetty1 min read

ఆ వజ్రం ఆంజనేయుడికే.. భక్తుడి కానుక!

అన్నమయ్య జిల్లా రాజంపేట ఆంజనేయ స్వామి వారి ఆలయ హుండీలో ఓ విలువైన ముడి వజ్రం లభ్యం కావడం స్థానికంగా ఆసక్తి రేకెత్తించింది.దేవాదాయ శాఖ అధికారులు హుండీ లెక్కింపు చేపట్టిన సందర్భంగా ఈ

ఆ వజ్రం ఆంజనేయుడికే.. భక్తుడి కానుక!
అన్నమయ్య జిల్లా రాజంపేట ఆంజనేయ స్వామి వారి ఆలయ హుండీలో ఓ విలువైన ముడి వజ్రం లభ్యం కావడం స్థానికంగా ఆసక్తి రేకెత్తించింది.దేవాదాయ శాఖ అధికారులు హుండీ లెక్కింపు చేపట్టిన సందర్భంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వజ్రంతో పాటు ఓ అజ్ఞాత భక్తుడు రాసిన లేఖ కూడా హుండీలో దొరికింది. హుండీలో కానుకలతో పాటు ఓ చిన్న పర్సులో ఉంచిన వజ్రం, దానికి జత చేసిన ఓ లేఖను అధికారులు గుర్తించారు. ఆ లేఖలో, తనకు ఈ వజ్రం దొరికిందని, దానిని తాను ధరించలేక స్వామివారికి సమర్పిస్తున్నానని సదరు భక్తుడు పేర్కొన్నారు. అంతేకాకుండా, ఇది నిజమైన వజ్రమని నిర్ధారించుకున్న తర్వాతే హుండీలో వేస్తున్నానని, దీనిని స్వామివారి అలంకరణకు ఉపయోగించే ఆభరణాలలో వినియోగించాలని ఆ భక్తుడు తన లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. అధికారులు ఆ వజ్రాన్ని పరిశీలించగా, అది సుమారు 1.396 క్యారెట్ల బరువున్న ముడి వజ్రమని ప్రాథమికంగా నిర్ధారించారు. భక్తుడి కోరిక మేరకు, ఈ వజ్రాన్ని స్వామివారి కైంకర్యాల నిమిత్తం వినియోగిస్తామని ఆలయ సిబ్బంది తెలిపారు.
Andhra Pradesh news
Annamayya district
rajampet
devotee
daimond in hanuman hundi
Raw Diamond
ఆంజనేయస్వామి ఆలయ హుండీలో వజ్రం లభ్యం
1.396 క్యారెట్ల ముడి వజ్రంగా నిర్ధారణ
Scroll for the next article