News28th Jul 04:22 PMSunil Byrisetty1 min read
ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో చర్చ
ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో చర్చ జరిగింది. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందని తెలిపారు. చిన్న చిన్న విషయాలను పట్టించుకోకూడదని, సైనికుల సత్త
ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో చర్చ జరిగింది. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందని తెలిపారు. చిన్న చిన్న విషయాలను పట్టించుకోకూడదని, సైనికుల సత్తాను ప్రశ్నించడం విపక్షాలకు సరికాదని సూచించారు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా ఇలాంటి మాటలు వినలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సైన్యం విషయంలో ఆచితూచి మాట్లాడాలని హితవు పలికారు. 1962 చైనాతో యుద్ధం సమయంలో.. విపక్షాలు ఎలాంటి ప్రశ్నలు వేశాయో తెలుసుకోవాలని సూచించారు. సైన్యాన్ని ఆనాడు వాజ్పేయి ప్రశంసించారని రాజ్నాథ్ గుర్తు చేశారు.