News21st Jun 11:16 AMSunil Byrisetty1 min read
రకుల్ దంపతులకు 'ఫిట్ ఇండియా కపుల్' అవార్డు
అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21) సందర్భంగా తమకు 'ఫిట్ ఇండియా కపుల్' అవార్డు లభించినట్లు నటి రకుల్ ప్రీత్ సింగ్ వెల్లడించారు. ఈ ప్రత్యేకమైన రోజున ఇటువంటి గుర్తింపు పొందడం పట్ల ఆమ
అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21) సందర్భంగా తమకు 'ఫిట్ ఇండియా కపుల్' అవార్డు లభించినట్లు నటి రకుల్ ప్రీత్ సింగ్ వెల్లడించారు. ఈ ప్రత్యేకమైన రోజున ఇటువంటి గుర్తింపు పొందడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలను యోగా సాధన వైపు ప్రోత్సహించే కార్యక్రమంలో పాలుపంచుకోవడం గర్వంగా ఉందని రకుల్ పేర్కొన్నారు. రకుల్ మాట్లాడుతూ.. "ప్రపంచ యోగా దినోత్సవం రోజున ఈ అవార్డు దక్కించుకోవడం మాకు ఎంతో గర్వంగా ఉంది. ప్రజలను యోగావైపు ఆకర్షితులను చేయడంలో భాగం కావడం ఆనందంగా ఉంది" అని తెలిపారు. ఫిట్నెస్ సాధించడానికి ఖరీదైన జిమ్లు లేదా ప్రత్యేకమైన పరికరాలు అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు. "ఎలాంటి ఫ్యాన్సీ జిమ్ములు అవసరం లేదు. మీరు మీ ఇంట్లోనే యోగాతో ఫిట్గా మారొచ్చు" అని రకుల్ వ్యాఖ్యానించారు.