Business Type14th Aug 04:03 PMSunil Byrisetty1 min read
చెక్కుల క్లియరెన్స్కు 4 గంటలే
చెక్కుల క్లియరెన్స్ సమయాన్ని గణనీయంగా తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకులకు కొత్త ఆదేశాలు జారీ చేసింది. కొత్త నిబంధన ప
చెక్కుల క్లియరెన్స్ సమయాన్ని గణనీయంగా తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకులకు కొత్త ఆదేశాలు జారీ చేసింది. కొత్త నిబంధన ప్రకారం, అన్ని చెక్కుల క్లియరెన్స్ 4 గంటల్లోనే పూర్తయ్యేలా ఉండాలి. ఈ ఆదేశం అక్టోబర్ 4 నుంచి అమల్లోకి రానుంది. దీని ద్వారా వినియోగదారులకు వేగవంతమైన సౌకర్యం కల్పించడం, బ్యాంకింగ్ లావాదేవీలలో సమయపరిమితులను తగ్గించడమే లక్ష్యం అని ఆర్బీఐ తెలిపింది. దీంతో వినియోగదారులు వేచి చూసే సమయం కూడా తగ్గనుంది.