News16th Sep 04:17 PMSunil Byrisetty1 min read
తెలుగు అకాడమీ చైర్మన్ గా ఆర్డీ విల్సన్
భారతీయజనతా పార్టీ సీనియర్ నాయకులు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ బిజెపి మాజీ ఇంఛార్జ్ ఆర్డీ విల్సన్ (శరత్ చంద్ర)తెలుగు అకాడమీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంల
భారతీయజనతా పార్టీ సీనియర్ నాయకులు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ బిజెపి మాజీ ఇంఛార్జ్ ఆర్డీ విల్సన్ (శరత్ చంద్ర)తెలుగు అకాడమీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఉదయం 11గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బాధ్యత స్వీకరణ మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయజనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ పాల్గొని ప్రసంగించారు. తెలుగు అకాడమీకి పునర్వైభవం రావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు,బిజెపి రాష్ట్ర,జిల్లా నాయకులు కవులు, కళాకారులు,అభిమానులు పాల్గొని సభను విజయవంతం చేశారు.