News11th Nov 11:36 AMSunil Byrisetty1 min read
మూతపడిన ఎర్రకోట మెట్రో స్టేషన్
దేశ రాజధానిఢిల్లీలో బాంబు పేలడంతో హై అలర్ట్ విధించారు.w పేలుడు నేపథ్యంలో ఎర్రకోట మెట్రో స్టేషన్ను తాత్కాలికంగా మూసివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఎర్రకోట సమీపంలోని సుభాష్
దేశ రాజధానిఢిల్లీలో బాంబు పేలడంతో హై అలర్ట్ విధించారు.w పేలుడు నేపథ్యంలో ఎర్రకోట మెట్రో స్టేషన్ను తాత్కాలికంగా మూసివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఎర్రకోట సమీపంలోని సుభాష్ మార్గ్ వద్ద హ్యుందాయ్ ఐ20 కారు పేలుడుతో పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం కేంద్ర ఇంటెలిజెన్స్ దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఫోరెన్సిక్, NIA, NSG బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి. భద్రతా కారణాల వల్ల ఎర్రకోట మెట్రో స్టేషన్ కు 500 మీటర్ల పరిధిలో నో ఎంట్రీ జోన్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఉగ్రదాడికి సంబంధించిన పలు కీలక ఆధారాలను అధికారులు సేకరించారు.