News15th Oct 04:42 PMSunil Byrisetty1 min read
భాకరాపేటలో పుష్పలపై దాడి
తిరుపతి జిల్లా భాకరా పేటలో ఎర్రచందనం స్మగ్లర్లపై ఫారెస్ట్ అధికారులు దాడి చేశారు. ఎర్ర చందనం దుంగల స్మగ్లింగ్ జరుగుతోందన్న పక్కా సమాచారంతో ఈ దాడులకు దిగారు. దాదాపు 25 లక్షల విలువగల,
తిరుపతి జిల్లా భాకరా పేటలో ఎర్రచందనం స్మగ్లర్లపై ఫారెస్ట్ అధికారులు దాడి చేశారు. ఎర్ర చందనం దుంగల స్మగ్లింగ్ జరుగుతోందన్న పక్కా సమాచారంతో ఈ దాడులకు దిగారు. దాదాపు 25 లక్షల విలువగల, 2 కార్లు 15 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకన్నారు. భాకరాపేట ఫారెస్ట్ రేంజర్ వెంకటరమణ ఆధ్వర్యంలో ఎర్రచందన స్మగ్లర్లపై దాడులు కొనసాగాయి. రెండుచోట్ల ఎర్రచందనం పట్టుబడింది. అదే సమయంలో స్మగ్లర్లు కార్లు, దుంగలు విడిచి పరారయ్యారు.