Mobiles8th Jan 01:38 PMSunil Byrisetty1 min read

ప్రీమియం లుక్‌తో Redmi Note 15 5G

స్మార్ట్ ఫోన్ సంస్థ రెడ్మీ, తమ సరికొత్త మిడ్ రేంజ్ 5జీ స్మార్ట్ ఫోన్ అయిన Redmi Note 15 5G ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్ ,

ప్రీమియం లుక్‌తో Redmi Note 15 5G
స్మార్ట్ ఫోన్ సంస్థ రెడ్మీ, తమ సరికొత్త మిడ్ రేంజ్ 5జీ స్మార్ట్ ఫోన్ అయిన Redmi Note 15 5G ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్ , 108 మాస్టర్ పిక్సెల్ మెయిన్ కెమెరా, 5520 mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లతో విడుదలైంది. ఈ ఫోన్ 108 మెగా పిక్సెల్ కెమెరాని కలిగి ఉంది. ఇది మంచి క్వాలిటీతో ఎక్కువగా ఫొటోస్ తీసుకోవాలని భావించే వారికి ఉపయోగకరంగా ఉండనుంది. మరొకవైపు ఈ స్మార్ట్ ఫోన్ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అనే రెండు వేరియంట్స్ లో విడుదల అయ్యింది. ఇందులో బేస్ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ధరని రూ. 19,999 లుగా, అలాగే రెండవ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ధరని రూ. 21,999 లుగా కంపెనీ నిర్ణయించింది.
Tech News
Mobile Gadgets
Redmi Note 15 5G
Xiaomi Redmi
5G Smartphones
Mid-Range Smartphone
Snapdragon 6 Gen 3
108MP Camera Phone
Fast Charging Mobile
Smartphone Launch India
Scroll for the next article