News17th Sep 02:29 PMSunil Byrisetty1 min read

రాజధాని కోసం అసైన్డ్ భూములిచ్చిన రైతులకు ఊరట

రాజధాని నిర్మాణం కోసం గతంలో అసైన్డ్ భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా సీఆర్డీయేకు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం ఊరట కల్పించింది. రిటర్నబుల్ ప్లాట్‌లలో "అసైన్డ్" అని పేర్కొనడంతో వాటి అమ్మకా

రాజధాని కోసం అసైన్డ్ భూములిచ్చిన రైతులకు ఊరట
రాజధాని నిర్మాణం కోసం గతంలో అసైన్డ్ భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా సీఆర్డీయేకు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం ఊరట కల్పించింది. రిటర్నబుల్ ప్లాట్‌లలో "అసైన్డ్" అని పేర్కొనడంతో వాటి అమ్మకాలు జరగడం లేదని రైతులు ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో సీఎం సూచనల మేరకు అసైన్డ్ భూములు ఇచ్చిన వారికి ఇచ్చే రిటర్నబుల్ ప్లాట్‌లలో ఇకపై "అసైన్డ్" అనే పదం లేకుండా "పట్టా భూమి"గా పేర్కొనాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ల్యాండ్ పూలింగ్ చట్టంలోని 9.24లో కాలం నంబర్ 7, రూల్ నంబర్ 11 (4) క్లాజ్‌ను సవరిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ జీవో నంబర్ 187 విడుదల చేశారు.
Andhra Pradesh
Capital Region
CRDA
Land Pooling
Farmers Relief
Assigned Lands
Returnable Plots
Government Order
Patta Land
Real Estate
Amaravati
ప్రభుత్వ నిర్ణయం
భూమి సంరక్షణ
పునర్వినియోగ భూములు
Scroll for the next article