News3rd Sep 03:05 PMSunil Byrisetty1 min read

ఆ ఇద్దరు ఐపీఎస్ లకు ఊరట

గత ప్రభుత్వంలో ముంబై నటి జెత్వానీని నిర్బంధించారన్న ఆరోపణలపై కూటమి ప్రభుత్వం ఇద్దరు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ సీనియర్ ఐపీఎస్ అధికారులు కాంతి రాణా ట

ఆ ఇద్దరు ఐపీఎస్ లకు ఊరట
గత ప్రభుత్వంలో ముంబై నటి జెత్వానీని నిర్బంధించారన్న ఆరోపణలపై కూటమి ప్రభుత్వం ఇద్దరు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ సీనియర్ ఐపీఎస్ అధికారులు కాంతి రాణా టాటా , విశాల్ గున్నిలపై సస్పెన్షన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. వారిని తక్షణమే సర్వీసులోకి పునరుద్ధరిస్తూ జీఏడీ ఉత్తర్వులు జారీ చేసింది. అఖిల భారత సర్వీసుల క్రమశిక్షణ, అప్పీల్ నిబంధనల ప్రకారం గతంలో వీరిద్దరినీ సస్పెండ్ చేసిన ప్రభుత్వం, ఎప్పటికప్పుడు ఆ నిర్ణయాన్ని సమీక్షిస్తూ ఉత్తర్వులను పొడిగిస్తూ వచ్చింది. తాజాగా విధించిన సస్పెన్షన్ గడువు సెప్టెంబర్ 4తో ముగియనున్న తరుణంలో ఈ కీలక నిర్ణయం వెలువడింది. ఈ ఇద్దరు అధికారుల సస్పెన్షన్ ఎత్తివేత ప్రక్రియకు సంబంధించి డీజీపీ సమర్పించిన నివేదికలను ప్రభుత్వం పరిశీలించింది. న్యాయ, పాలనాపరమైన అంశాలను పరిశీలించిన అనంతరం, సస్పెన్షన్‌ను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Andhra Pradesh Government
Kanthi Rana Tata
Vishal Gunni
IPS Officers
AP Government
IPS Suspension
Suspension Revoked
Jethwani Case
ముంబై నటి
ఆంధ్రప్రదేశ్ పోలీస్
జీఏడీ ఉత్తర్వులు
డీజీపీ నివేదిక
అమరావతి
ఏపీ రాజకీయాలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు
Scroll for the next article