Telangana16th Aug 02:07 PMSunil Byrisetty1 min read
చంద్రబాబుపై రేవంత్రెడ్డి ప్రశంసలు..హైదరాబాద్కు గుర్తింపు
హైటెక్ సిటీని ప్రపంచ ఐటీ కేంద్రంగా మార్చిన ఘనత ఏపీ సీఎం చంద్రబాబుకే దక్కుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైటెక్స్లో జరిగిన క్రెడాయ్ ప్రాపర్టీ షోలో రేవంత్ రెడ్డి
హైటెక్ సిటీని ప్రపంచ ఐటీ కేంద్రంగా మార్చిన ఘనత ఏపీ సీఎం చంద్రబాబుకే దక్కుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైటెక్స్లో జరిగిన క్రెడాయ్ ప్రాపర్టీ షోలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 1990లలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు హైటెక్ సిటీ ప్రాజెక్టును ఊహించి, అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. "కొందరు గుర్తించబడతారు, మరికొందరు గుర్తించబడరు. కానీ హైటెక్ సిటీ అభివృద్ధి క్రెడిట్ చంద్రబాబుకే దక్కాల"ని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి చేసిన ఈ ప్రశంస, హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు ఎంతగా ప్రభావం చూపారనేది తెలుస్తుందని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.