News12th Dec 10:37 AMSunil Byrisetty1 min read
అల్లూరి జిల్లాలో లోయలోకి బస్సు
ఏపీలో బస్సు ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోయలో పడింది. చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో రాజుగారిమెట
ఏపీలో బస్సు ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోయలో పడింది. చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో రాజుగారిమెట్ట వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
బస్సులో ఇద్దరు డ్రైవర్లు, 35 మంది వరకు యాత్రికులు ఉన్నారు. వీరిలో 12 మందికిపైగా మృతి చెందినట్లు సమాచారం. మరికొందరికి గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చింతూరు పోలీసులు చేరుకున్నారు. భద్రాచలం దర్శనం పూర్తిచేసుకుని అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులోని ప్రయాణికులు చిత్తూరు జిల్లాకు చెందినవారిగా సమాచారం. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.