News13th May 11:46 AMSunil Byrisetty1 min read
రేషన్ బియ్యం తరలిస్తే రౌడీషీట్!
రేషన్ మాఫియా గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. రేషన్ మాఫియాపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రేషన్ మాఫియాపై ఇప్పటివరకు ఒక లెక్క ఇకనుంచి ఒక లెక్క అని తేల్చి చెప్పారు. ప
రేషన్ మాఫియా గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి.
రేషన్ మాఫియాపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.
రేషన్ మాఫియాపై ఇప్పటివరకు ఒక లెక్క ఇకనుంచి ఒక లెక్క అని తేల్చి చెప్పారు.
పేదల బియ్యం అక్రమంగా తరలిస్తే వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.
అక్రమ రేషన్ బియ్యనికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఆదేశించారు.
రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు తెలిస్తే వారిపై రౌడీషీట్ ఓపెన్ చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలో గుంటూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలలో బరితెగించి ప్రజల రేషన్ బియ్యంపై కోట్ల రూపాయలు కూడబెడుతున్న రేషన్ డాన్లకు ఇక రోజులు దగ్గర పడ్డాయి.