Spiritual30th Oct 01:08 PMSunil Byrisetty1 min read
శబరిమలలో ప్రతిరోజు 90 వేల మంది భక్తులకు అనుమతి
మండల, మకరవిళక్కు పూజ సమయంలో రోజుకు 90,000 మంది భక్తులను అనుమతించాలని శబరిమల దేవస్వం బోర్డు సమావేశం నిర్ణయించింది. నవంబర్ 1 నుంచి బుకింగ్లు ప్రారంభమవుతాయి. ఆన్లైన్ బుకింగ్ ద్వారా
మండల, మకరవిళక్కు పూజ సమయంలో రోజుకు 90,000 మంది భక్తులను అనుమతించాలని శబరిమల దేవస్వం బోర్డు సమావేశం నిర్ణయించింది. నవంబర్ 1 నుంచి బుకింగ్లు ప్రారంభమవుతాయి. ఆన్లైన్ బుకింగ్ ద్వారా 70,000, మరియు స్పాట్ బుకింగ్ ద్వారా 20,000 మంది మాత్రమే దర్శనం కోసం బుక్ చేసుకోవచ్చు. అయ్యప్ప స్వాములు దయచేసి ఆన్లైన్ బుకింగ్ లో మాత్రమే తమ దర్శనాన్ని బుక్ చేసుకోవడం మంచిదని గురుస్వాములు సూచిస్తున్నారు. అక్కడికి వెళ్లిన తర్వాత స్పాట్ బుకింగ్ కోసం ఎదురు చూడవద్దని చెబుతున్నారు. స్పాట్ బుకింగ్ అనేది కేవలం 20000 టికెట్లు మాత్రమే అక్కడికి వెళ్లిన తర్వాత దొరకకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుందని చెబుతున్నారు.