News4th Apr 02:22 PMSunil Byrisetty1 min read
గుంటూరులో “సఖి నివాస్” ప్రారంభం.. మహిళా హాస్టల్
గుంటూరులో ప్రభుత్వ వర్కింగ్ ఉమెన్ హాస్టల్ ప్రారంభమైంది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఈ సఖి నివాస్ ను ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ 100 మంది మహిళలు రక్షణగా ఉండగల
గుంటూరులో ప్రభుత్వ వర్కింగ్ ఉమెన్ హాస్టల్ ప్రారంభమైంది.
గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఈ సఖి నివాస్ ను ప్రారంభించారు.
మంత్రి మాట్లాడుతూ 100 మంది మహిళలు రక్షణగా ఉండగలిగే మహిళా హాస్టల్ ఇదని చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన విధానం ప్రకారం మహిళా రక్షణ కోసం రూ. 2 కోట్లతో నిర్మించిన భవనమని తెలిపారు.
అన్నిరకాల మౌలిక వసతులు, మెరుగైన సౌకర్యాలతో నిర్మించిన ఈ భవనం వర్కింగ్ ఉమెన్కు అనుకూలంగా ఉంటుందన్నారు.
రాష్ట్రంలో మరిన్ని భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
అవసరమైన చోట్ల సఖి నివాస్లు అందుబాటులోకి తెస్తామన్నారు.
ఎమ్మెల్యే గళ్ళా మాధవి, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.