News26th Jun 09:44 AMSunil Byrisetty1 min read
సంస్కృతం కన్నా తెలుగు తక్కువా?
దేశంలో ప్రాంతీయ భాషల కోసం కేంద్ర ప్రభుత్వం చేసిన ఖర్చు చూస్తే సంస్కృతం కోసం అత్యధికంగా ఉండగా, తెలుగుకు అతి తక్కువ వ్యయం ఉంది. ఆర్టీఐ సమాచారం ప్రకారం తెలుగు భాషపై కేవలం రూ.12.65 కోట
దేశంలో ప్రాంతీయ భాషల కోసం కేంద్ర ప్రభుత్వం చేసిన ఖర్చు చూస్తే సంస్కృతం కోసం అత్యధికంగా ఉండగా, తెలుగుకు అతి తక్కువ వ్యయం ఉంది. ఆర్టీఐ సమాచారం ప్రకారం తెలుగు భాషపై కేవలం రూ.12.65 కోట్ల ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం భారతీయ భాషలను ప్రోత్సహించేందుకు ఏటా కొంత నిధులను కేటాయిస్తుంది. గత పదేళ్లలో వీటి కోసం ఎంత ఖర్చు చేసిందో ఆర్టీఐ వెల్లడించింది. 2014-2025 మధ్య కాలంలో సంస్కృత భాష కోసమే ఏకంగా రూ.2,532.59 కోట్లు ఖర్చు చేసింది. ఉర్దూ కోసం రూ.838 కోట్లు, హిందీకి రూ.426 కోట్లు, తమిళం కోసం రూ.120 కోట్లు, సింధీపై రూ.54 కోట్లు ఖర్చు చేస్తే.. తెలుగు భాషపై కేవలం రూ.12.65 కోట్లు మాత్రమే వినియోగించింది.