Education12th Jun 11:25 AMSunil Byrisetty1 min read
రాష్ట్రంలో నేటి నుంచి పునఃప్రారంభం
రాష్ట్రంలో నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. తొలిరోజునే పిల్లలకు పాఠ్య, నోటు పుస్తకాలు అందజేయనున్నారు. బట్టలు, బూట్లు, సాక్సులు, బెల్టు, బ్యాగ్తో కూడిన విద్యామిత్ర కిట్
రాష్ట్రంలో నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. తొలిరోజునే పిల్లలకు పాఠ్య, నోటు పుస్తకాలు అందజేయనున్నారు. బట్టలు, బూట్లు, సాక్సులు, బెల్టు, బ్యాగ్తో కూడిన విద్యామిత్ర కిట్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరికీ అందజేయనున్నారు. అలాగే నేటి నుంచి 'బడికి పోదాం' కార్యక్రమం కూడా అమలు కానుంది. నేటి నుంచి 2025-26 విద్యాసంవత్సరంలో మార్పులు అమల్లోకి రానున్నాయి. జీవో నెంబర్-117ను రద్దుచేసి కొత్తగా 9 రకాల పాఠశాలల విధానం అమలు చేయనున్నారు. కొత్తగా ఈ ఏడాది 8,398 ఆదర్శ ప్రాథమిక పాఠశాలల ఏర్పాటు చేయనున్నారు.