News2nd May 12:57 PMSunil Byrisetty1 min read
సీఆర్పీఎఫ్ ఆపరేషన్.. కర్రెగుట్టలపై బేస్ క్యాంప్!
మావోయిస్టు ప్రాంతాలపై సీఆర్పీఎఫ్ పైచేయి సాధించింది. ఛత్తీస్ గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో విస్తరించిన కర్రెగుట్టలపై భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ నిర్వహించాయి. 9 రోజులుగా కొనసాగిన ఈ ఆపరేష
మావోయిస్టు ప్రాంతాలపై సీఆర్పీఎఫ్ పైచేయి సాధించింది.
ఛత్తీస్ గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో విస్తరించిన కర్రెగుట్టలపై భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ నిర్వహించాయి.
9 రోజులుగా కొనసాగిన ఈ ఆపరేషన్లో కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఘనవిజయం సాధించింది.
మావోయిస్టుల చొరబాట్లకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ చేపట్టారు.
డ్రోన్లు, హెలికాప్టర్ల సహాయంతో అడవుల్లో కష్టమైన ప్రదేశాలను గుర్తించి సమర్థవంతంగా భద్రతా బలగాలు తనిఖీలు జరిపాయి.
ఈ ఆపరేషన్కు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడంతో ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) చీఫ్ స్వయంగా కర్రెగుట్ట ప్రాంతానికి చేరుకున్నారు.
ఇప్పటికే మావోయిస్టుల డంపులు, సొరంగాలను గుర్తించిన భద్రతా బలగాలు, వాటిని నిర్వీర్యం చేయడంలో విజయవంతమయ్యాయి.
ఈ నేపథ్యంలో కర్రెగుట్టలపై సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.