News7th Jan 02:58 PMSunil Byrisetty1 min read

ఇంద్రకీలాద్రిపై రాజేంద్ర ప్రసాద్ పూజలు

నేడు ఉదయం విజయవాడ చేరుకున్న సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంద్రకీలాద్రికి చేరుకోగా, ఆలయ అధికారులు అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. రాజేంద్ర ప్రసాద్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక

ఇంద్రకీలాద్రిపై రాజేంద్ర ప్రసాద్ పూజలు
నేడు ఉదయం విజయవాడ చేరుకున్న సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంద్రకీలాద్రికి చేరుకోగా, ఆలయ అధికారులు అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. రాజేంద్ర ప్రసాద్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఆలయ మండపంలో అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం పలికారు. ఆలయ మర్యాదలతో రాజేంద్ర ప్రసాద్‌కు శేష వస్త్రాన్ని కప్పి గౌరవించారు. ఆలయ అధికారులు అమ్మవారి, ప్రసాదాన్ని ఆయనకు అందజేశారు.
Andhra Pradesh
Rajendra Prasad
Indrakeeladri
Vijayawada
Kanaka Durga Temple
ప్రత్యేక పూజలు
తెలుగు సినీ నటుడు
ఆధ్యాత్మిక దర్శనం
ఆలయ కార్యక్రమాలు
Scroll for the next article