Politics18th May 09:58 AMSunil Byrisetty1 min read

బీజేపీ వైపు వైసీపీ అడుగులు!?

వైసీపీ మాజీ MLA ప్రసన్నకుమార్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో తాము తప్పుచేశామని ప్రసన్నకుమార్‌ అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల్లో BJPతో పొత్తు పెట్టుకుంటే బాగుండేదన్నారు.

బీజేపీ వైపు వైసీపీ అడుగులు!?
వైసీపీ మాజీ MLA ప్రసన్నకుమార్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో తాము తప్పుచేశామని ప్రసన్నకుమార్‌ అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల్లో BJPతో పొత్తు పెట్టుకుంటే బాగుండేదన్నారు. పార్లమెంటులో NDA తెచ్చిన ప్రతి బిల్లుకు మద్దతిచ్చామని గుర్తు చేశారు. గత ఐదేళ్లలో మోదీ ఏం చెబితే అది చేశామని వ్యాఖ్యానించారు. చివరకు బీజేపీకి దూరమయ్యామని, నష్టపోయామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుందామనేది తన అభిప్రాయమని చెప్పారు. తుదినిర్ణయం జగన్‌దేనని ప్రసన్న వ్యాఖ్యానించారు.
AP Politics
YSRCP
BJP
Nallapureddy Prasannakumar Reddy
MLA
వైసీపీ మాజీ MLA ప్రసన్నకుమార్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
Scroll for the next article