News11th Aug 03:52 PMSunil Byrisetty1 min read
ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా ప్లీనరీ సమావేశాల్లో విద్యార్థుల సమస్యలపై తీర్మానాలు తీసుకోవడం జరిగింది. నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా నూతన అధ్యక్ష కార
ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా ప్లీనరీ సమావేశాల్లో విద్యార్థుల సమస్యలపై తీర్మానాలు తీసుకోవడం జరిగింది. నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా నూతన అధ్యక్ష కార్యదర్శులుగా టి కుమారస్వామి, సిహెచ్ వెంకటేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం విద్యారంగ సమస్యలు పరిష్కారం కోసం భవిష్యత్ కార్యాచరణ తీసుకున్నారు. నూతనగా ఎన్నికైన జిల్లా అధ్యక్ష కార్యదర్శులు టి కుమార స్వామి, సిహెచ్.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో కొత్త యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని, విద్యార్థులు స్కిల్స్ పెంచడానికి విజయవాడ కేంద్రంగా సైన్స్ హబ్ ఏర్పాటు చేయాలని కోరారు. సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు మెస్& కాస్మొటిక్ ఛార్జీలు పెంచాలని, పెండింగ్ నిధులు విడుదల చేయాలని, సొంత భవనాలు ఏర్పాటు చేయాలని కోరారు. జూనియర్, డిగ్రీ కాలేజీలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్ విద్యార్థులను ఐక్యం చేసి పోరాటాలను నిర్వహిస్తామని తెలిపారు.