Politics19th Sep 02:50 PMSunil Byrisetty1 min read
బాబుకు శాపాలు పెట్టిన షర్మిల!
ఉల్లి రైతులకు మద్దతుగా షర్మిల గొంతెత్తారు. కూటమి ప్రభుత్వం ఉల్లి రైతులను నిండా ముంచేసిందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. రైతుల ఇంట కన్నీళ్ళు పెట్టించిన పాపం సీఎం చం
ఉల్లి రైతులకు మద్దతుగా షర్మిల గొంతెత్తారు. కూటమి ప్రభుత్వం ఉల్లి రైతులను నిండా ముంచేసిందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. రైతుల ఇంట కన్నీళ్ళు పెట్టించిన పాపం సీఎం చంద్రబాబుకు తగులుతుందని శాపనార్థాలు పెట్టారు. 'ఉల్లి ఎండినా నష్టమే.. ఇప్పుడు పండినా నష్టమే. ఎకరాకు రూ.1.20లక్షల పెట్టుబడి పోసి పండిస్తే.. మీరిచ్చే ధర కిలోకి 50 పైసలా? ఆరుగాలం కష్టించి పండిస్తే రైతుకి దక్కిన ఆదాయం ఎకరాకు రూ.3వేలు మాత్రమేనా.' అంటూ నిలదీశారు. ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.