Entertainment4th Aug 09:30 AMSunil Byrisetty1 min read
నేటి నుంచి సినిమా షూటింగులు బంద్!
తెలుగు ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి టాలీవుడ్లో షూటింగ్స్ బంద్ చేయాలని నిర్ణయించింది. 30 శాతం వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.
తెలుగు ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి టాలీవుడ్లో షూటింగ్స్ బంద్ చేయాలని నిర్ణయించింది. 30 శాతం వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. వేతనాలు పెంచితేనే షూటింగ్స్లో పాల్గొంటామని స్పష్టం చేసింది. వేతనాలు పెండింగ్ లేకుండా రోజువారీగా ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. ఇతర భాషా సినిమాలు, వెబ్సిరీస్లకూ ఇదే నిబంధన వర్తిస్తుందని తెలుగు ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రకటించింది.