29th Apr 09:43 AMSunil Byrisetty1 min read
రేపు సింహగిరిపై చందనోత్సవం
విశాఖపట్నం జిల్లా సింహాచలంలో కొలువై ఉన్న వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారి చందనోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిజరూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న అప్పన్నస్వామి. నిజరూప దర్శనానికి ర
విశాఖపట్నం జిల్లా సింహాచలంలో కొలువై ఉన్న వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారి చందనోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.
నిజరూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న అప్పన్నస్వామి. నిజరూప దర్శనానికి రెండు లక్షలకుపైగా భక్తులు వస్తారని అంచనా.
సామాన్య భక్తుల దర్శనానికి అధిక ప్రాధాన్యతిస్తూ ఏర్పాట్లు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్వామివారికి రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.
టీటీడీ నుంచి చైర్మన్ బి ఆర్ నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
చందనోత్సవానికి రెండు వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.