Health15th Aug 04:12 PMSunil Byrisetty1 min read
వ్యాధుల నియంత్రణలో 'సిమ్యులేషన్ ఎక్సర్సైజస్'
ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు తొలిసారిగా వ్యాధుల నియంత్రణపై సిమ్యులేషన్ ఎక్సర్సైజ్లు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్బాబు త
ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు తొలిసారిగా వ్యాధుల నియంత్రణపై సిమ్యులేషన్ ఎక్సర్సైజ్లు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్బాబు తెలిపారు. కృష్ణా జిల్లాలో ఆగస్టు 18, 19 తేదీల్లో లెప్టోస్పిరోసిస్పై, పశ్చిమగోదావరి జిల్లాలో ఆగస్టు 20, 21 తేదీల్లో హైలీ పాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా (హెచ్పీఏఐ)పై తొలి దశ వ్యాయామాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత విశాఖపట్నంలో డెంగ్యూ, విజయనగరంలో స్క్రబ్ టైఫస్, గుంటూరులో కలరా/తీవ్రమైన విరేచనాల వ్యాధులపై సిమ్యులేషన్ వ్యాయామాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
వాస్తవంగా వ్యాధి వ్యాప్తి జరిగినట్లు భావించి, వ్యాధి గుర్తింపు నుంచి నియంత్రణ వరకు ఆరోగ్య వ్యవస్థ, వివిధ ప్రభుత్వ శాఖలు ఎంత సమర్థంగా స్పందిస్తాయో ఈ వ్యాయామాల ద్వారా పరీక్షించనున్నారు. వ్యాధిని సకాలంలో గుర్తించడం, సమాచారం చేరవేయడం, దర్యాప్తు, నమూనాల సేకరణ–పరీక్షలు, మందులు–సామగ్రి సమకూర్చడం, ప్రజలకు సమాచారమివ్వడం, వివిధ శాఖల మధ్య సమన్వయం వంటి అంశాలను పరిశీలిస్తారు.