News29th Jan 03:55 PMSunil Byrisetty1 min read
పంజాబ్ సరిహద్దుల్లో స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో భారీ కుట్ర భగ్నమైంది. పోలీసులు పెద్ద ఎత్తున సాగుతున్న మాదకద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణా కుట్రను భగ్నం చేశారు. విలేజ్ డిఫెన్స్ కమిటీ అందించిన కీలక సమాచార
పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో భారీ కుట్ర భగ్నమైంది. పోలీసులు పెద్ద ఎత్తున సాగుతున్న మాదకద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణా కుట్రను భగ్నం చేశారు. విలేజ్ డిఫెన్స్ కమిటీ అందించిన కీలక సమాచారంతో పోలీసులు దాడి నిర్వహించి భారీ మొత్తంలో హెరాయిన్తో పాటు మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో మొత్తం 42,983 కిలోల హెరాయిన్, నాలుగు హ్యాండ్ గ్రెనేడ్లు, ఒక స్టార్ మార్క్ పిస్టల్, 46 లైవ్ బుల్లెట్లు, అలాగే నిందితులు వదిలివెళ్లిన ఒక మోటార్సైకిల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి అమృత్సర్కు చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేయగా, పరారీలో ఉన్న ఇతర నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. దేశ భద్రతకు ముప్పు కలిగించే ఇలాంటి కుట్రల వెనుక ఉన్న అసలు సూత్రధారులను త్వరలోనే పట్టుకుంటామని డీజీపీ గౌరవ్ యాదవ్ స్పష్టం చేశారు.