Sports15th Apr 12:26 PMSunil Byrisetty1 min read
ఐసీసీ ఛైర్మన్గా మళ్లీ దాదాయే!
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) మెన్స్ క్రికెట్ కమిటీ ఛైర్మన్గా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మళ్లీ నియమితులయ్యారు. దాదా గతంలోనూ ఐసీసీ చైర్మన్గా విధులు నిర్వర్తించారు
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) మెన్స్ క్రికెట్ కమిటీ ఛైర్మన్గా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మళ్లీ నియమితులయ్యారు.
దాదా గతంలోనూ ఐసీసీ చైర్మన్గా విధులు నిర్వర్తించారు.
తాజాగా మరోసారి దాదానే నియమిస్తున్నట్లు ఐసీసీ గ్లోబల్ గవర్నింగ్ బాడీ అధికారికంగా ప్రకటించింది.
గంగూలీ దీర్ఘకాల సహచరుడు వీవీఎస్ లక్ష్మణ్ కూడా ప్యానెల్ సభ్యులలో ఒకరిగా మళ్లీ ఎంపికయ్యారు.
2000 నుంచి 2005 వరకు భారత జట్టుకు నాయకత్వం వహించిన గంగూలీ 2021 నుంచి ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ ఛైర్మన్గా కొనసాగుతున్నారు.