News20th Aug 10:03 AMSunil Byrisetty1 min read
మహాబలిపురంలో దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం..!
మహాబలిపురంలో దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం జరుగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. సమావేశానికి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చే
మహాబలిపురంలో దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం జరుగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. సమావేశానికి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి సీఎంలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రూ.52,474 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలని సీఎం చంద్రబాబు కోరనున్నారు. రాష్ట్రాలు, కేంద్ర-రాష్ట్రల మధ్య ఉన్న సమస్యలు, వివాదాల పరిష్కారంపై చర్చించనున్నారు. ఏపీ విభజన చట్టంలోని వివిధ అంశాలపై ప్రతినిధులు చర్చించనున్నారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయమే సమావేశ లక్ష్యమని కేంద్ర హోంశాఖ వెల్లడించింది.