News1st Apr 03:00 PMSunil Byrisetty1 min read
ఏప్రిల్ 5న పాస్పోర్టుల జారీకి ప్రత్యేక డ్రైవ్
రాష్ట్రంలో పాస్పోర్ట్ సేవలకు డిమాండ్ పెరిగింది. ఆ డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం ఏప్రిల్ 5న ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆ రోజు
రాష్ట్రంలో పాస్పోర్ట్ సేవలకు డిమాండ్ పెరిగింది.
ఆ డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం ఏప్రిల్ 5న ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది.
ఇందులో భాగంగా ఆ రోజుకు విజయవాడ సేవా కేంద్రంలో 800, తిరుపతి సేవా కేంద్రంలో 500 స్లాట్లను విడుదల చేశారు.
ఇప్పటికే ఉన్న దరఖాస్తుదారులు తమ అపాయింట్మెంట్లు రీషెడ్యూల్ చేసుకోవచ్చని ప్రాంతీయ పాస్ పోర్ట్ అధికారి శివహర్ష ఓ ప్రకటనలో తెలిపారు.
ఇదే కాకుండా ఏప్రిల్లో ప్రతి బుధవారం విజయవాడ సేవా కేంద్రంలో 750 అదనపు అపాయింట్మెంట్లతో రెగ్యులర్ డ్రైవ్ కొనసాగుతుందని పేర్కొన్నారు.
పెరిగిన డిమాండ్కు అనుగుణంగా డ్రైవ్ నిర్వహిస్తున్నారు.
అలాగే అవసరమైతే స్లాట్లు, అపాయింట్మెంట్లు కూడా పెంచే అవకాశాలు కనిపిస్తు్న్నాయి.