News18th Nov 10:17 AMSunil Byrisetty1 min read
మోదీ పర్యటనకు ప్రత్యేక అధికారులు!
పుట్టపర్తిలో నిర్వహించే శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 19న పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మరం
పుట్టపర్తిలో నిర్వహించే శ్రీ
సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 19న పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ప్రధాని పర్యటన సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు, రవాణా సౌకర్యాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ముగ్గురు ఐఏఎస్ అధికారులను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు ఐఏఎస్ అధికారులు గోపాలకృష్ణ, గోవిందరావు, కల్యాణ్ చక్రవర్తికి పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించింది. ప్రధాని పర్యటన ముగిసే వరకు వీరు పుట్టపర్తిలోనే ఉండి ఏర్పాట్లను సమన్వయం చేస్తారు. వీరితో పాటు సమీప జిల్లాలకు చెందిన ఒక జాయింట్ కలెక్టర్ (జేసీ) మరియు 9 మంది డిప్యూటీ కలెక్టర్లకు కూడా అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఈ నియామకాలకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.