News11th Mar 11:02 AMSunil Byrisetty1 min read
శబరిమల వెళ్తున్నారా.. ఇవి తెలుసుకోండి!
శబరిమల అయ్యప్ప దర్శనానికి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు విచ్చేస్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి అయితే ఈ సంఖ్య లెక్కకు మించి ఉంటుంది. ఇటీవల అయ్యప్పస్వామి ఆలయంలో స్వామి దర్శ
శబరిమల అయ్యప్ప దర్శనానికి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు విచ్చేస్తుంటారు.
తెలుగు రాష్ట్రాల నుంచి అయితే ఈ సంఖ్య లెక్కకు మించి ఉంటుంది.
ఇటీవల అయ్యప్పస్వామి ఆలయంలో స్వామి దర్శనానికి సంబంధించి పలు మార్పులు చేసినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.
ఇప్పటి వరకు మెట్లను ఎక్కాక భక్తులు వంతెన మీదుగా స్వామి దర్శనానికి వెళ్లాలి.
ఆ విధానంలో మార్పులు చేసి 18 పవిత్ర మెట్లను అధిరోహించిన వెంటనే భక్తులు నేరుగా స్వామిని దర్శించుకునేలా చేయాలని నిర్ణయించారు.
కొత్త విధానాన్ని ఈ నెల 15 నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు.