Sports11th Jul 12:14 PMSunil Byrisetty1 min read
ఘనంగా ఎస్ఎస్ జీ వార్షిక క్రీడల పోటీలు
ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ విభాగంలోని స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ వార్షిక క్రీడల పోటీలు ఘనంగా జరిగాయి. మంగళగిరిలోని ఎస్ఎస్ జీ గ్రౌండ్స్ లో నిర్వహించిన ఈ క్రీడా పోటీలకు ముఖ్య అతిథిగా అ
ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ విభాగంలోని స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ వార్షిక క్రీడల పోటీలు ఘనంగా జరిగాయి. మంగళగిరిలోని ఎస్ఎస్ జీ గ్రౌండ్స్ లో నిర్వహించిన ఈ క్రీడా పోటీలకు ముఖ్య అతిథిగా అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మహేష్ చంద్ర లడ్హా, ఐజీ పీహెచ్ డీ రామకృష్ణ తదితర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ డైరెక్టర్ ఏ.జగదీష్, ఎస్పీ చెన్నుపాటి భద్రయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వార్షిక పోటీల్లో 25 క్రీడాంశాల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్హా టగ్ ఆఫ్ వార్ పోటీలను ప్రారంభించారు. క్రీడల పోటీల్లో ఆరు విభాగాల్లో మొదటి స్థానంలో నిలిచిన ఎస్. కమలేంద్రరావు ఈ ఏడాది వార్షిక క్రీడల్లో ఓవరాల్ ఛాంపియన్ గా నిలిచారు. క్రీడలు శారీరక ధృడత్వాన్ని మానసిక ఉల్లాసాన్ని, టీమ్ స్పిరిట్ ను పెంపొందిస్తాయని ఇంటెలిజెన్స్ చీఫ్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.