News11th Dec 12:33 PMSunil Byrisetty1 min read

రాజధానిలో స్టార్ హోటల్స్!

రాజధాని అమరావతిలో స్టార్ హోటళ్ల నిర్మాణం మొదలైంది. ఐకానిక్ భవనాలు పూర్తయ్యేలసరికి… పూర్తి స్థాయిలో స్టార్ హోటల్స్ కూడా అందుబాటులోకి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. మూడు పెద్ద స్టార్ హ

రాజధానిలో స్టార్ హోటల్స్!
రాజధాని అమరావతిలో స్టార్ హోటళ్ల నిర్మాణం మొదలైంది. ఐకానిక్ భవనాలు పూర్తయ్యేలసరికి… పూర్తి స్థాయిలో స్టార్ హోటల్స్ కూడా అందుబాటులోకి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. మూడు పెద్ద స్టార్ హోటల్స్ ప్రాజెక్టులకు భూమి పూజలు జరిగాయి. దసపల్లా, నోవోటెల్, తాజ్ వివాంతా – ఈ మూడు కలిపి సుమారు రూ. 620 కోట్ల పెట్టుబడి పెడుతున్నాయి. ఇందులో రూ. 200 కోట్లతో 4-స్టార్ హోటల్‌ను దసపల్లా నిర్మిస్తోంది. రెండు ఎకరాల్లో వస్తున్న ఈ హోటల్ నుంచి నాలుగు వందలకు పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. 2028 చివరి నాటికి ఆపరేషన్స్ ప్రారంభం కానున్నాయి. ఇక నోవోటెల్ లింగాయపాలెంలో రూ. 220 కోట్లతో 5-స్టార్ హోటల్ & కన్వెన్షన్ సెంటర్‌లను నాలుగు ఎకరాల్లో నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టు 2027 చివరి నాటికి పూర్తవుతుంది. మందడం సీడ్ యాక్సెస్ రోడ్‌లో రూ.200 కోట్లతో తాజ్ వివాంతా 5-స్టార్ హోటల్ నిర్మాణం ప్రారంభమైంది. నాలుగు ఎకరాల్లో తాజ్ గ్రూప్ బ్రాండ్‌తో G.V. ఎస్‌టేట్స్ & హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టు చేపట్టింది. కన్వెన్షన్ సెంటర్ కోసం అదనంగా 2.5 ఎకరాలు కూడా కేటాయించారు. ఇది కూడా 2028 నాటికి రెడీ అవుతుందని సమాచారం.
Andhra Pradesh Development
Amaravati
Star Hotels
Daspalla Hotel
Novotel
Taj Vivanta
Hospitality Sector
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు
రాజధాని అభివృద్ధి
Scroll for the next article