News25th Nov 05:15 PMSunil Byrisetty1 min read

స్టెమీతో 95.94 శాతం మందికి తప్పిన ప్రాణగండo

గ్రామీణ ప్రాంతాల్లో అకస్మాత్తుగా గుండె నొప్పి వచ్చిన వారికి 'అత్యవసర వైద్యం' (గోల్డెన్ అవర్) కింద స్టెమీ విధానంలో ఇస్తున్న చికిత్సవల్ల గతేడాది జూన్ 1 నుంచి ఈ నెల 15 వరకు 3,027 మంది

స్టెమీతో 95.94 శాతం మందికి తప్పిన ప్రాణగండo
గ్రామీణ ప్రాంతాల్లో అకస్మాత్తుగా గుండె నొప్పి వచ్చిన వారికి 'అత్యవసర వైద్యం' (గోల్డెన్ అవర్) కింద స్టెమీ విధానంలో ఇస్తున్న చికిత్సవల్ల గతేడాది జూన్ 1 నుంచి ఈ నెల 15 వరకు 3,027 మంది ప్రాణాలు నిలిచాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రాష్ట్రంలో 238 ప్రభుత్వ సామాజిక(CHCs), ప్రాంతీయ(AHs), జిల్లా ఆసుపత్రుల్లో(DHs) ప్రవేశపెట్టిన 'స్టెమీ' (ST-segment elevation myocardial infraction) విధానం కింద ఖరీదైన 'టెనెక్టెప్లస్‌' ఇంజెక్షన్ ఉచితంగా ఇవ్వడం ద్వారా విలువైన ప్రాణాలు నిలబడుతున్నాయని తెలిపారు. ఛాతీనొప్పి లక్షణాలతో ఆసుపత్రులకు వచ్చిన వారిలో 'టెనెక్టె ప్లేస్' ఇంజక్షన్ అవసరమని గుర్తించిన 3,155 మందిలో 3,027 (95.94%) మంది ప్రాణాలు నిలబడినట్లు పేర్కొన్నారు. వీరితోపాటు ఇంజెక్షన్ పొందిన మిగిలిన వారి ఆరోగ్య పరిస్థితి అప్పటికే విషమించి ఉండడం, సమయం మించిపోవడం వంటి కారణాలతో ప్రాణాలు విడిచారని పేర్కొన్నారు. ఈ సంఖ్యను ఇంకా తగ్గించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎన్సీడీ-4.0 సర్వేలో భాగంగా స్టెమీ విధానం అమలుపై ఆశా వ‌ర్క‌ర్లు, ఎ.ఎన్.ఎం.ల ద్వారా ఛాతీనొప్పి లక్షణాలు ఎలా గుర్తించాలన్న దానిపై శిక్షణ ఇవ్వబోతున్నామని మంత్రి సత్యకుమార్ నివేదించారు.
Andhra Pradesh health department
STEMI treatment
heart attack care
Tenecteplase injection
golden hour emergency care
ఎటాక్ ట్రీట్మెంట్
గ్రామీణ ఆరోగ్యం
అత్యవసర చికిత్స
ఛాతీనొప్పి
Scroll for the next article