National10th Jul 11:40 AMSunil Byrisetty1 min read
పౌర్ణమి వేళ.. ఉత్తర భారతంలో భూప్రకంపనలు
ఉత్తర భారతదేశంలో పలు చోట్ల భూప్రకంపనలు కనిపించాయి. పౌర్ణమి రోజున హరియాణా, ఢిల్లీ- ఎన్సీఆర్ ప్రాంతంలో భూమి కంపించడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూకంపం తీవ్రత రెక్టార్ స్క
ఉత్తర భారతదేశంలో పలు చోట్ల భూప్రకంపనలు కనిపించాయి. పౌర్ణమి రోజున హరియాణా, ఢిల్లీ- ఎన్సీఆర్ ప్రాంతంలో భూమి కంపించడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూకంపం తీవ్రత రెక్టార్ స్కేల్పై 4.1గా నమోదు అయింది. భూమి ఒక్కసారిగా కంపించటంతో స్థానికులు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. మరోవైపు భూకంపం రావటానికి కొన్ని గంటల ముందు ఎన్సీఆర్ పరిధిలో భారీ వర్షం కురిసింది. భూకంప జోన్ పరిధిలో ఉన్న ఈ ప్రాంతంలో మరిన్ని ప్రకంపనలు చోటు చేసుకోవచ్చని అంచనాలు వేస్తు్న్నారు.